రాయవరంలో ఇండిస్టిల్‌ పార్కుకు నేడు శంకుస్థాపన

May 7,2025 21:16

అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి
ప్రజాశక్తి – వెల్దుర్తి :
మాచర్ల మండలం రాయవరం గ్రామంలో ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఇండిస్టియల్‌ పార్క్‌కు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులతో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వెల్దుర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమావేశమయ్యారు. మాచర్ల నియోజకవర్గం పారిశ్రామికంగా పురోగతి సాధించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని అన్నారు. రాయవరం జంక్షన్‌ నందు ప్రభుత్వ రంగ సంస్థ ఎపిఐఐసి ఆధ్వర్యంలో దాదాపు 7 ఎకరాల్లో అన్ని మౌలిక వసతులతో ఇండిస్టియల్‌ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. చిన్న తరహా (ఎంఎస్‌ఎంఇ) పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇండిస్టియల్‌ పార్కులో అతి తక్కువ ధరకు స్థలాలు కేటాయిస్తామని, ఈ అవకాశాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఎపిఐఐసి జోనల్‌ మేనేజర్‌ డాక్టర్‌ ఎం.ఎల్‌ నరసింహారావు, డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ మధు, డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ కృష్ణమెహన్‌ పాల్గొన్నారు.

➡️