ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న వ్యాపార సంస్థలన్నిటికీ ఈ నెలాఖరులోగా ట్రేడ్ లైసెన్సులు విధించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య కార్యదర్శులకు ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో సచివాలయ శానిటరీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెస్టారెంట్లు, నర్సింగ్ హోమ్లు, వస్త్ర దుకాణాలు, ప్రైవేటు స్కూలు, కళాశాలలు, సినిమా ధియేటర్లు, కళ్యాణ మండపాలు వంటి అన్ని వ్యాపార సంస్థలకు ట్రేడ్ లైసెన్సులు విధించాలన్నారు. ఇప్పటికే ట్రేడ్ లైసెన్సులు కలిగి ఉన్నవారు ఫీజులు చెల్లించి రెన్యువల్ చేయించుకోవాలన్నారు. రానున్న వర్షాకాలం నాటికి కాలువల్లో పూడికలు లేకుండా చేయాలన్నారు. సమావేశంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, సీనియర్ అసిస్టెంట్ రమేష్రాజు పాల్గొన్నారు.అయ్యన్న పేటలో పర్యటించిన కమిషనర్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మంగళవారం అయ్యన్నపేట ప్రాంతంలో కమిషనర్ పల్లి నల్లనయ్య పర్యటించారు. పారిశుధ్య పరిస్థితులను గమనిస్తూనే, వీధి దీపాల నిర్వహణ, మంచినీటి పంపిణీ ఏ విధంగా ఉందో పరిశీలించారు. అక్కడక్కడ చెత్తాచెదారాలు నిల్వ ఉండడాన్ని చూసి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. అనంతరం 51 వ నెంబరు సచివాల యాన్ని ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో ఉన్న అన్నాక్యాంటీన్ ను పరిశీలించారు. ఆహారం స్వీకరించే వారు ఎండ బారిన పడకుండా అన్నా క్యాంటీన్ చుట్టూ రూఫ్ ఏర్పాటుకై ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు.
