ప్రజాశక్తి-ములకలచెరువు అన్నమయ్య జిల్లా ములకలచెరువులో విషాదం నెలకొన్నది. చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి ఒకే కుటుం బానికి చెందిన నలుగురు ప్రమా దవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. తండ్రితోపాటు ముగ్గురు పిల్లలు మత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుము కున్నాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు…శనివారం మధ్యాహ్న సమ యంలో దుస్తులు ఉతికేందుకు చెరువు వద్దకు ఓ కుటుంబం వెళ్లింది. మండ లంలోని దందువారిపల్లి కుట్టడం నిర్మించిన కాలనీలో ఈశ్వరమ్మ, మలేష్ దంప తులు నివాసం ఉంటున్నారు. ఈశ్వరమ్మ, మల్లేష్ దుస్తులు ఉతికేందుకు సమీపంలోని పెద్దచెరువుకు వెళ్తుండగా వారి ఇద్దరు పిల్లలు లావణ్య, నందకి షోర్లతో కలిసి ఇంటి పక్కలో ఉన్న నందితాతో కలిసి చెరువు వద్దకు వెళ్లారు. చెరువు నీటి కుంటలో పిల్లలు లావణ్య(12), నందకిషోర్(9), నందిత(10) అడు కుంటూ లోతులోకి జారుకొని మునిగి పోయారు. వారిని గమనించిన మల్లేష్ కాపాడేందుకు చెరువు కుంటలోకి దూకాడు. చెరువు కుంట లోతుగా ఉండడంతో పిల్లలతో పాటు మల్లేష్ మునిగిపోయాడు. ఈశ్వరమ్మ కేకలు వేయడంతో లాభం లేకపోయింది. చీకటి కావడంతో అటువైపు స్థానికులు సంచారం లేకపోయింది. అక్కడ నుంచి రాజీవ్ కాలనీలోకి వెళ్లి స్థానికులకు సమాచారం అందించింది. వారు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది చెరువులోకి దిగి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే నలుగురు మత్యువాత పడ్డారు. చిన్నారులు నీటి మునిగి మృతి చెందిన విషయం గ్రామంలోనికి దావానంలా వ్యాపించడంతో ప్రజలు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మతదేహాలను మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
