ప్రజాశక్తి-పార్వతీపురం రూరల్ : సార్వత్రిక టీకా కార్యక్రమంలో పిల్లలకు వేసిన ప్రతీ టీకా వివరాల నమోదు తప్పనిసరి ఆరోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి టి.జగన్ మోహనరావు స్పష్టం చేశారు. ఎంఆర్ నగరంలో టీకా కార్యక్రమాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు, గర్భిణులకు షెడ్యూల్ ప్రకారం టీకాలు వేస్తున్నారా? అని రికార్డులు పరిశీలించారు. పిల్లల వయస్సు బట్టి వేయాల్సిన అన్ని టీకాలు కచ్చితంగా పూర్తి చేసి యువిన్, ఆర్సిహెచ్ పోర్టల్లో ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. తద్వారా టీకా కార్యక్రమ తీరు పర్యవేక్షణ పక్కాగా ఉండటమే గాక అవసరమైనప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికెట్ కూడా జెనరేట్ చేసి అందజేయవచ్చని తెలియజేశారు. టీకా నిర్వహించేటప్పుడు ఉండాల్సిన హబ్ కట్టర్, ఎఇఎఫ్ఐ కిట్ పరిశీలించారు. వ్యాక్సిన్ వేసిన తరువాత కొంత సమయం అక్కడే పర్యవేక్షణలో ఉంచాలన్నారు. టీకా అర్హుల జాబితా, గడువు తేదీల కార్డుల నిర్వహణకు సంబంధించిన టిక్లర్ బ్యాగ్ను వినియోగిస్తున్న తీరుపై అక్కడ పరిశీలించారు. గహ సందర్శనలు చేసి ఎప్పటికపుడు పిల్లలు, బాలింతల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిడెమిక్ ఇఒ సత్తిబాబు, ఎఎన్ఎం డి.పోలమ్మ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
