మందస : మందస ఎంపీడీఓ గా వై. వెంకట రమణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన శ్రీకాకుళం మండల పరిషత్ లో పరిపాలన అధికారిగా పనిచేస్తూ పదోన్నతి పై రెగ్యులర్ మండల పరిషత్ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇంచార్జి ఎంపీడీఓ గా వ్యవహరించిన ఎన్. రమేష్ నాయుడు నుంచి ఈయన బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు మందస మండల పరిషత్ పరిపాలన అధికారి బి. రుషేశ్వర రావు, ఈఓ ఆర్డీ జయప్రకాశ్, టైపిస్ట్ ధనలక్ష్మి మరియు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
