మంచిగా ఆలోచించాలి

మెరకముడిదాం: సమాజంలో అందరితో మంచిగా ఉంటూ, మంచిగా ఆలోచిస్తూ, మంచిని పెంచాలని హైకోర్టు జడ్జి చీమలపాటి రవికుమార్‌ ఆకాంక్షించారు. తన తండ్రి చీమలపాటి సూర్యనారాయణతో కలిసి స్వగ్రామమైన బైరిపురానికి శుక్రవారం ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం అయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రులను, పుట్టిన ఊరిని ఎన్నటికీ మరువ కూడదన్నారు. సన్మార్గంలో నడిస్తే ఎప్పుడూ న్యాయం జరుగుతుందన్నారు. తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే, అది తన తల్లిదండ్రులు చూపిన మార్గమేనని తెలిపారు. క్రమశిక్షణతో నడిపించబట్టే తనకు ఈ గౌరవం దక్కిందన్నారు. అయినా ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలనేదే తన సిద్ధాంతమని తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు పప్పల క్రిష్ణమూర్తి, కందుల శ్రీనివాసరావు, ఎస్‌.రాంబాబు, శ్రీధర్‌, కందుల రామ, బాదం వెంకటరాజు, ఎస్‌.నర్సింగరావు, ఎస్‌.వెంకట సత్యనారాయణ, ఎస్‌ఐ నవీన్‌ పడాల్‌ పాల్గొన్నారు.

➡️