ప్రజాశక్తి – రామభద్రపురం : అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం చేయడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఐసిడిఎస్ పీడీ షేక్ రుక్సానాసుల్తాన్బేగం అన్నారు. మండలంలోని బూసాయ వలస అంగ న్వాడీ కేంద్రంలో మంగళవారం ఆమె ఆకస్మిక తనిఖీ నిర్వహించి కిశోర్ బాలికలతో మాట్లాడారు. అంగ న్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు, గర్భిణులకు పౌష్టికా హారంపై అవగాహన కల్పిస్తున్నా మన్నారు. ముఖ్యంగా కిశోర బాలికలకు ప్రతీ మంగళ, శుక్రవా రాలు వివిధ అంశా లపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. అన్ని కేంద్రాల్లో మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని గర్భిణులకు అందిస్తున్నారని తెలిపారు. జిల్లాలో 12 అంగ న్వాడీ టీచర్లు, 67 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, జిల్లా 2,499 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, వీటిలో 293 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. వీటన్నింటికి పక్కా భవనాలు కల్పించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. బేటీ పడావా, బేటీ బచావో కార్యక్రమంలో భాగంగా జీవో నెంబరు 39 ప్రకారం బాల్య వివాహాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. దీనిపై ఇప్పటికే గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి గ్రామ సర్పంచ్ చైర్ పర్సన్గా ఉంటూ 11 మంది సభ్యులను నియమించి ఒకటి, మూడవ శుక్రవారాల్లో గ్రామాల వారీగా మహిళా పోలీ సుల ఆధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని తెలి పారు. జిల్లాలో 2024 -25 సంవత్సరంలో 25 బాల్య వివా హాలు నిరోధించామని, వీరిలో కొంత మందిపై కేసులు కూడా నమోదు చేశామని చెప్పారు. ముఖ్యంగా కిశోర బాలికలు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని తెలిపారు. కిశోర వికాశం-2పై విస్తృతమైన అవగాహన కల్పిసు ్తన్నామన్నారు. సిబ్బంది సమయపాలన పాటించి కేంద్రాలను సక్రమంగా నిర్వహించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గర్భిణులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ లక్ష్మీ, బాడంగి సిడిపిఒ రాజ్యలక్ష్మి, సూపర్వైజరు కృష్ణకుమారి, సూర్యకుమారి పాల్గొన్నారు.విజయనగరం: కిశోర బాలికలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్లు కలిగిన మంచి ఆహారాన్ని తీసుకోవాలని ఐసిడిఎస్ ఎసిడిపిఒ తవిటి నాయుడు తెలిపారు. ఈనెల 2నుంచి జరుగుతున్న కిశోర వికాసం కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం సిపి గుడి అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉన్న కిశోరి బాలికలకు రుతుస్రావంపై మహిళా సంరక్షణ కార్యదర్శి భారతి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తవిటినాయుడు మాట్లాడుతూ పౌష్టికాహారం, బాలికలలో వచ్చే రుతు చక్ర సమస్యలు, బాలల హక్కులు, విద్యా, కెరీర్, బాల్య వివాహాలు, టీనేజ్ గర్భిణీ, సైబర్ నేరాలు, ఫోక్సో చట్టం, శారీరక వ్యాయామం వాటిపై దశలవారీగా అవగాహన కల్పిస్తామని తెలిపారు. బాలికల్లో ప్రతినెల వచ్చే రుతుస్రావంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. యుక్తవయసులో ప్రోటీన్లు కలిగిన ఆహారాన్ని తీసుకుంటే ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉండి క్రమం తప్ప కుండా రుతు స్రావం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సూపర్ వైజర్ అనురాధ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, ఆర్పిలు పాల్గొన్నారు.
