ప్రజాశక్తి – బొబ్బిలి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఎమ్మెల్యే బేబినాయన ఘనంగా నివాళులర్పించారు. స్థానిక కోటలో బుధవారం అల్లూరి వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజనులు హక్కుల కోసం పోరాటం చేసిన మహౌన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని బేబినాయన అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.టిఆర్ కాలనీలో వర్ధంతిస్థానిక టిఆర్ కాలనీలో వనమిత్ర అధ్యక్షులు కె.కృష్ణదాసు అల్లూరి సీతారామరాజు వర్ధంతి నిర్వహించి అల్లూరి జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. గిరిజనులు పక్షాన అల్లూరి పని చేశారన్నారు.కొత్తవలస: తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో అల్లూరి పార్క్ వద్ద అల్లూరి విగ్రహానికి తహశీల్దార్ నీలకంఠరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేద మహిళకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సేవాసమితి అధ్యక్షుడు ఎం.గోపిరాజు, సిరివూరి గణేశ్వర రాజు, డిప్యూటీ తహశీల్దార్ సునీత, ఇఒపిఆర్డి శ్రీదేవి, విఆర్ఒలు, క్షత్రియ సేవాసమితి సభ్యులు కమ్మెల్ల నాని బాబు రాజు, ముదునూరు గోపిరాజు, పిఎస్ వర్మ, ముదునూరి వర్మ, కమ్మేళ హరిరాజు, శ్రీనురాజు, గొట్టుముక్కల వరహాలరాజు పాల్గొన్నారు.నెల్లిమర్ల: కొండగుంపాంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి సిపిఐ నాయకులు మొయిద పాపారావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పి.సూర్య, తవిటినాయుడు, రామునాయుడు, సూర్యారావు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.చీపురుపల్లి: అల్లూరి సీతారామరాజు వర్ధంతిని క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఆర్టిసి కాంప్లెక్స్ ముందున ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యువత అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సేవా సంఘం ప్రతినిధులు జగన్నాధరాజు, సీతారామరాజు, వెంకటరమణరాజు, జుజ్జూరు శివశంకరవర్మ, పాకలపాటి తిరుపతిరాజు, సాంభరాజు, బుజ్జి, శ్రీనురాజు తదితరులు పాల్గొన్నారు.
