ప్రజాశక్తి- రాజాం : నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మే 20వ తేదీన జరగబోయే సమ్మెలో అందరూ పాల్గొవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకి సురేష్ పిలుపునిచ్చారు. బుధవారం ప్రాజెక్ట్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ చందుకు అంగన్వాడీలతో కలిసి ఆయన సమ్మె నోటీస్ను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక కోడ్లు రద్దు, అంగన్ వాడీ సమస్యల పరిష్కారానికై అఖిల భారత కేంద్ర కార్మిక సంఘాలు, ఎవిఎఫ్డబ్ల్యుహెచ్, స్వతంత్ర ఫెడరేషన్ల పిలుపు మేరకు మే 20వ తేదీన జరగబోయే సమ్మెలో మన రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్స్ అందరూ పాల్గొనాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా కార్మికవర్గం పై బానిసత్వాన్ని రుద్దటానికి 29 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్స్ను తెచ్చిందన్నారు. దీన్ని తిప్పి కొట్టడానికే ఈ సమ్మె నిర్వహిస్తున్నామన్నారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఐసిడిఎస్ బడ్జెట్ పెంచాలని కోరారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, గ్రాట్యూటీ జిఓ 8ని మార్పుచేయాలన్నారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జిఒ ఇవ్వాలన్నారు. అనంతరం సమ్మెకు సంబంధించిన బుక్లెట్స్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వి.లక్ష్మి, ప్రాజెక్ట్ అధ్యక్షులు హెచ్.రూపవతి, ఎల్ జయలక్ష్మి, వనజాక్షి, సుజాత, ప్రమీల, రాంబాయి, దమయంతి, నిర్మల, కుమారి, చిన్నతల్లి, మేరి, తదితరులు పాల్గొన్నారు.కొత్తవలస: పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను భంగం కలిగించే విధంగా బిజెపి మార్పు చేస్తుందని మెడికల్ రిప్రజెంట్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. రవికుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక ఎన్జిఒ హోమ్లో సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గాడి అప్పారావు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్మికులపై దాడి జరుగుతోందన్నారు. పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను సమూలంగా మార్చి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులు సంఘం పెట్టుకునే హక్కును కూడా తీసేస్తున్నారన్నారు. స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేసే వారిని పర్మినెంట్ చేయాలన్నారు. రైతన్న పండించే పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు వ్యవసాయ రంగంలో వాడుతున్న వాహనాల విడిభాగాలు సబ్సిడీ రేటుకి ఇవ్వాలన్నారు. వీటన్నింటిపై మే 20వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దెల రమణ, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు జెవి ప్రసాద్, కె.తులసి, పి.శారద, టి. రత్నం తదితరులు పాల్గొన్నారు.ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం ఇవ్వాలి పూసపాటిరేగ: ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో ఎంపిడిఒ రాధికకు వినతి అందించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు బచ్చల సూర్యనారాయణ మాట్లాడుతూ మ్యాండిస్ విధానం రద్దు చేయాలని, లేబర్ కోడ్ చేయాలని, హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలని, అందరికీ ఎఫ్డిఎఫ్ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మే 20వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెకు నోటీస్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు కే రాజేష్, విఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
