పాఠశాల స్థలం ఆక్రమణ పై ధర్నా

May 9,2025 20:22

ప్రజాశక్తి – భోగాపురం : పాఠశాల స్థలం ఆక్రమణకు గురైందని ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని కూటమిలోని అధికార పార్టీకి చెందిన జనసేన నాయ కులు స్థానికులతో కలిసి శుక్రవారం ధర్నా నిర్వహిం చారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంతోపాటు మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు బొల్లు త్రినాథ్‌, మాత నవీన్‌ మాట్లా డుతూ భోగాపురం గ్రామంలోని పెద హరిజన పేట పాఠశాల స్థలం ఆక్రమణకు గురైందని స్థానిక తహశీ ల్దార్‌ కార్యాలయంతో పాటు మండల పరిషత్‌ అధికా రులతో పాటు గ్రీవెన్స్‌ సెల్‌లో పెద్ద హరిజన పేటకు చెందిన వారు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు కనీసం స్పందించలేదని అన్నారు. అంతేకాక పాఠశా లకు సంబంధించిన ఎటువంటి రికార్డ్స్‌ లేనందున మేమేం చేయలేమని చెబుతున్నారని అన్నారు. ఈ పాఠశాల స్థలాన్ని ఒక ఉద్యోగతో పాటు కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకుని ఇల్లు నిర్మాణాలు చేపట్టినప్పటికీ పట్టించుకోలేదని అన్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ అధికా రులు స్పందించకపోవడంతో స్థానికలతో కలిసి ధర్నా చేశామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని వీరు డిమాండ్‌ చేశారు. లేదంటే మున్ముందు ఇంకా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.

➡️