రథం ఎక్కడంతో విరిగిన యువకుడి కాలు
ప్రజాశక్తి-బొబ్బిలి : విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగే గొల్లపల్లి దాడితల్లి సిరిమానోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. స్థానిక జెండామాల్ జంక్షల్లో మంగళవారం రాత్రి 11.15 గంటల సమయంలో మీగడవీధికి చెందిన అంటిపేట జయరాం పైనుంచి రథం చక్రం వెళ్లడంతో తీవ్రంగా కాలు విరిగిపోయింది. తీవ్రంగా గాయపడిన జయరాంను పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా ప్రధమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం విజయనగరం తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.