విద్యార్థి మిత్ర స్టాక్‌ పాయింట్ల పరిశీలన

May 5,2025 21:30

ప్రజాశక్తి-వేపాడ, కొత్తవలస : వేపాడ, కొత్తవలస జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర కిట్ల స్టాక్‌ పాయింట్లను సమగ్రశిక్ష సెక్టోరియల్‌ బృందం సోమ వారం పరిశీలించింది. సిఎంఒ వి.ఆదినారాయణ, ఎపిఒ వి.గోపిచంద్‌, ఎఎంఒ బి.ప్రసాద్‌, అసిస్టెంట్‌ సిఎంఒ కె.రామారావు పరిశీలించారు. ఇంత వరకు వచ్చిన పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టాక్‌ రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఇఒలు ఎన్‌.నాగభూషణరావు, పి.బాల భాస్కరరావు, జి.శ్రీదేవి, బండారు శ్రీనివాసరావు, ఎంఆర్‌సి సిబ్బంది, సిఆర్‌ఎంటిలు, తదితరులు పాల్గొన్నారు.

➡️