ప్రజాశక్తి-విజయనగరంకోట : జిల్లాలో పనిచేస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులను హేతుబద్ధీకరణ నుంచి మినహాయించాలని వ్యవసాయ విస్తరణ అధికారుల ఉమ్మడి జిల్లాల సంఘం నాయకులు జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావును కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం అధ్యక్షులు ఎం.నాగరాజు మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల హేతుబద్దీకరణలో కొన్నిచోట్ల తమను కూడా గ్రామసా ్థయిలోని రైతు సేవా కేంద్రాలలో వేయడాన్ని నిరసిస్తు న్నామన్నారు. తమను మండల వ్యవసాయ అధికారి కార్యాల యంలో సహాయకులుగా నియమించాలని కోరుతున్నా మన్నారు. కార్యదర్శి పి.కుర్మారావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కూడా వ్యవసాయ విస్తరణ అధికారులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఈ ప్రభుత్వంలో అయినా న్యాయం చేస్తారని ఆశించిన ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 15ఏళ్లకు పైబడి వ్యవసాయ విస్తరణ అధికారులుగా పనిచేస్తున్న కనీసం ఉద్యోగోన్నతి కల్పించకుండా, తమకు సంబంధంలేని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అయిన గ్రామ వ్యవసాయ సహాయ కులకు అదనపు సిబ్బంది గా నియమించడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఈ విషయమై వెంటనే స్పందించి తమను మండల కార్యాలయాల్లో వ్యవసాయ అధికారులకు సహాయకులుగా నియమించా లన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి ఎం. సూరిబాబు, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ పి.జగన్నాథ రావు, సభ్యులు హేమ మహేశ్వరరావు, గిరిబాబు పాల్గొన్నారు.
