సిరిమాను చెట్టుకు ఎమ్మెల్యే పూజలు

May 7,2025 21:34

ప్రజాశక్తి- డెంకాడ : మండలంలోని అక్కివరంలో ఈనెల 12,13,14 తేదీల్లో జరిగే పైడితల్లమ్మ పండగ సిరిమాను కోసం సిద్ధం చేసిన చెట్టుకు ఎమ్మెల్యే లోకం నాగ మాధవి బుధవారం పూజలు నిర్వహించి చెట్టును కొట్టారు. గ్రామంలో ప్రజలందరూ చెట్టుకు పూజలు నిర్వహించి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ సిరిమాను చెట్టు కోసం గ్రామంలోని అప్పలనాయుడు కళ్ళంలోని ఉన్న చెట్టును గుర్తించి పూజారి కంది వెంకటరమణ ఆధ్వర్యంలో చెట్టు తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ గ్రామంలో ఇలాంటి పండగ సుమారు 120 సంవత్సరాల తరువాత చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పండగకు గ్రామస్తులు సుమారు కోటి రూపాయలు వరకు ఖర్చు పెడుతున్నారు. పైడితల్లమ్మ ఉత్సవాలు నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. చెట్టు తొలగించిన తరువాత ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి కంది చంద్రశేఖర రావు మాజీ జెడ్‌పిటిసి కంది సూర్యనారాయణ, ఎంపిపి బంటుపల్లి వెంకట వాసుదేవరావు, వైసిపి నాయకులు పిన్నింటి తమ్మునాయుడు, టిడిపి మండల అధ్యక్షుడు పల్లె భాస్కరరావు, సర్పంచ్‌ కంది కిరణ్‌కుమార్‌, పానీరాజు, మహంతి చిన్నమనాయుడు, సువ్వాడ రవి శేఖర్‌, కాగితాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️