ఆర్‌డిఒ క్షేత్రస్థాయి పరిశీలన

May 6,2025 21:05

ప్రజాశక్తి – వేపాడ : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొంతమంది రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చామలాదేవి అగ్రహారం వద్ద నిర్మిం చిన క్వారీ గిడ్డింగ్‌ నిర్మాణానికి సంబంధించిన రికార్డులను ఆర్‌డిఒ దాట్ల కీర్తి మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆతవ గ్రామంలో జరుగుతున్న రీ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె సిబ్బందితో మాట్లాడుతూ రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, ప్రతి రైతుకు సర్వే ఫలితం దక్కే విధంగా సర్వే ఉండాలని, ఏ విధమైన లోపం ఉన్నా సంబంధిత సిబ్బందిపై కఠినమైన చర్యలు ఉంటాయని సిబ్బందికి తెలిపారు. ఈ పరిశీలనలో తహశీల్దార్‌ జె.రాములమ్మ. ఎంఆర్‌ఐ. రామలక్ష్మి. మండల సర్వేయర్‌ జగన్నాథం, గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ సర్వేయర్‌ రైతులు పాల్గొన్నారు.

➡️