వయో పరిమితి 47కి పెంచాలి
డివైఎఫ్ఐ డిమాండ్
కోట జంక్షన్ వద్ద నిరసన, రాస్తారోకో
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని, వయోపరిమితి 47 సంవత్సరాలు పెంచాలని, జిల్లాకు ఒకే పేపర్ విధానం ఉండాలని, పరీక్షలకు 90 రోజులకు గడువు ఇవ్వాలని గురువారం కోట జంక్షన్ వద్ద నిరసన తెలియజేసి మానవహారం చేయడం జరిగింది. కార్యక్రమన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సిహెచ్ హరీష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో నిరుద్యోగులు పోరాట ఫలితంగా డీఎస్సీ నోటిఫికేషన్ సాధించుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసి ఏడు సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం హర్షం వ్యక్తం చేశారు. ఏడు సంవత్సరాల తర్వాత వెలుడినటువంటి నోటిఫికేషన్ లో నిరుద్యోగులు సన్నద్ధం అవ్వడానికి పరీక్షకు కనీసం 90 రోజులను సమయం లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు అన్నారు. అలాగే వయోపరిమితి 44 సంవత్సరాల కేటాయించడంతో ఇప్పటికే డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ ఉంటూ వయోభారంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఇది చాలా ఇబ్బంది కలిగినటువంటి విషయం అన్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం 47 సంవత్సరాలకు ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవడానికి వయోపరిమితి పెంచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 47 సంవత్సరాలకు వరకు అవకాశం కల్పించాలని కోరుతున్నామన్నారు. అంతేకాకుండా నార్మలైజేషన్ రద్దుచేసి జిల్లాకు ఒకే పేపర్ నిర్వహించాలని అన్నారు. అదేవిధంగా ఓపెన్ డిగ్రీలో పాస్ అయిన వారిగున అవకాశం కల్పించాలని గ్రామీణ ప్రాంతాలలో మధ్యతరగతి ప్రజలు రెగ్యులర్ పరీక్షలు రాయాలంటే ఇబ్బంది పడే సందర్భంలో పనులు చేసుకుంటూ విద్యను సాగించకరంలో ఓపెన్ చదవడం జరిగిందని ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ లో ఓపెన్ వారికి అర్హతలు లేదని చెప్పడం దారుణం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని అన్నారు .ఈ కార్యక్రమంలో రాము,బాను, ఈశ్వర్ రావు, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.
