ప్రజాశక్తి- రాజాం: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే కోండ్రు మురళీ అన్నారు. శుక్రవారం గురవాం పంచాయతీ పరశురాంపేట గ్రామంలో రూ.70 లక్షలతో మంజూరైన బిటీ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి సాగు, తాగునీరు అందిస్తున్నామని, సూపర్ సిక్స్ హామీ మేరకు ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిందని, ఈ ఐదేళ్లలో నియోజకవర్గంను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అనంతరం డోలాపేట టిడిపి కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి, పలు గ్రామల నుండి వచ్చిన రెవెన్యూ సమస్యలపై వినతలను స్వీకరించి త్వరలోనే వీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పాక్ ఉగ్రదాడులను తిప్పి కొట్టిన భారత్ ఆర్మీ, రక్షణ దళాన్ని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో గురవాన నారాయణరావు, నంది సూర్య ప్రకాశరావు, కిమిడి అశోక్ కుమార్, దుప్పలపూడి శ్రీను, బవిరి శ్రీను, జనసేన నాయకులు యుపి రాజు, గెడ్డపు నీలకంఠం, నాగరాజు, బిజెపి నేతలు కోటగిరి నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.
