ప్రజాశక్తి-బొబ్బిలి : ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 20న చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నామని సోమవారం స్థానిక సిహెచ్సిలో వైద్యులకు వారు నోటీసు అందజేశారు. తొలుత సిహెచ్సి ఎదుట నిరసన తెలిపారు. ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలతో వెట్టిచాకిరీ చేయిస్తున్న ప్రభుత్వం కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇచ్చి ఆశాలను కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశా యూనియన్ నాయకులు శాంతి, ఎం.లక్ష్మి, మాలతి, తదితరులు పాల్గొన్నారు.బొబ్బిలిరూరల్ : ఆశాల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో పిరిడి పి.హెచ్.సి వైద్యులు రఘు వంశీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకర్రావు పాల్గొన్నారు.
