అభివృద్ధి విషయంలో వెనుకాడేది లేదు

May 9,2025 20:21

ప్రజాశక్తి – జామి : అభివృద్ధి విషయంలో వెనుకడుగు వేసే ప్రశక్తే లేదని, ప్రతి చిన్న అవకాశన్ని అభివృద్ధికే వినియోగిస్తామని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జామి మండల పరిషత్‌ నూతన సమావేశం భవనాన్ని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితో కలిసి ఆయన ప్రారంఇంచారు. అనంతరం ఎంపిపి సబ్బవరపు అరుణ అధ్యక్షతన మండల పరిషత్‌ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందరంగా జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నూతన సమావేశం భవనానికి ఏసి సదుపాయం ఉండాలని అందుకు జిల్లా పరిషత్‌ నుంచి కొంత నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో యుద్ధ వాతావరనం నెలకొన్న నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. సభలో చింతాడ సర్పంచ్‌ సుబ్రహ్మణ్యం మేట్ల నియామకంలో జాప్యం, అపరాలు పంట బీమా విషయాలను లేవనేత్తారు. ఈ కార్యక్రంలో జెడ్‌పిటిసి గొర్లె సరయు, వైసిపి మండల కన్వీనర్‌ జి. రవికుమార్‌, మండల అధికార బృందం, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

➡️