ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : లేబర్ కోడ్లు రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, ఖాళీలు భర్తీ, మూసి వేసిన పరిశ్రమలు తెరవాలని, కనీస వేతనం 26000/- లు అమలు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు పిలుపు మేరకు మే 20న దేశ వ్యాప్త సమ్మె పాల్గొంటున్నామని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తికి, విజయనగరం మండల తహసిల్దార్ కూర్మనాథం సమ్మె నోటీసు గ్రామ రెవెన్యూ సహాయకులు గురువారం నాడు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షులు కే గురుమూర్తి, మండల గౌరవ అధ్యక్షులు వి.ప్రసాద్, సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ.జగన్మోహన్రావు, మండల కార్యదర్శి రాజు, సభ్యులు భవాని తదితరులు పాల్గొన్నారు.
