ప్రజాశక్తి – నెల్లిమర్ల : నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో సమస్యలుంటే పరిష్కరిస్తామని నియోజకవర్గం ఎఇఆర్ఒ బి.సుదర్శనరావు తెలిపారు. మంగళవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో అఖిల పక్షం నాయకులతో ఎన్నికల డిటి వివిఆర్ జగన్నాధరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎఇఆర్ఒ సుదర్శనరావు మాట్లాడుతూ నియోజ కవర్గం మొత్తంలో 248, మండలంలో 70 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వాటిలో ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తామని అన్నారు. అఖిల పక్షం నేతలు మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో వేరువేరుగా ఓట్లు నమోదయ్యాయని వాటిని సరి చేయాలని కోరారు. ఓట్లు ఒక దగ్గర పోలింగ్ కేంద్రం ఒక దగ్గర ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై ఎఇఆర్ఒ సుదర్శ నరావు మాట్లాడుతూ చేర్పులు, మార్పులు నిరంతరం ప్రక్రియ కాబట్టి వాటిని సరి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు గేదెల రాజారావు, లెంక అప్పలనాయుడు, సిపిఎం నాయకులు కిల్లంపల్లి రామారావు, టి. అప్పలనరసయ్య, బిజెపి నాయకులు మైపాడ ప్రసాద్, చందక గోవింద, జనసేన నాయకులు పతివాడ అచ్చుంనాయుడు, అదపాక చిన్న, కాంగ్రెస్ నాయకులు కె.పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.
