ప్రజాశక్తి-విశాఖ : కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన విశాఖ వాసి చంద్రమౌళి మృతదేహాన్ని వారి స్వగృహం వద్ద సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, జివియంసి ఫ్లోర్ లీడర్ డా॥బి.గంగారావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి. కుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యురాలు పి.మణిలు సందర్శించి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ విహారయాత్రకు వెళ్ళిన పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి హత్య చేయడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కేంద్ర నిఘా వ్యవస్థ యొక్క డొల్లతనం మరోసారి బయటపడిరదన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే ఈ చర్యలకు పాల్పడిన వారిని శిక్షించాలని, కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పి ప్రజలు, పర్యాటకుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేసారు.
