ప్రజాశక్తి – ఎంవిపి కాలనీ : బుధవారం విడుదలైన ఎస్ ఎస్ సి 2025 ఫలితాల్లో విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీ బ్రాంచ్ భాష్యం విద్యార్థులు మార్కుల సునామీ సృష్టించారు. ఈ పరీక్షలకు మొత్తం 113 మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో ఆళ్ల లిఖిత (2504105131) 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ స్థానం లో విశాఖ జిల్లా లో మొదటి స్థానం సాధించింది. అదేవిధంగా 550 మార్కులకు పైగా 36 మంది, 500 కు పైగా మార్కులతో 68 మంది ఉత్తీర్ణత సాధించారని భాష్యం ఉత్తరాంధ్ర జోన్ ఇంచార్జ్ జీ.వి.ఆంజనేయులు తెలిపారు. అంతేకాకుండా మ్యాథ్స్ విభాగంలో పదిమంది, నూటికి నూరు శాతం మార్పులు సాధించగా 52 మంది 90 మార్కులకు పైగా సాధించారు. సైన్స్ విభాగం లో నూటికి నూరు శాతం మార్కులు ఒకరు సాధించగా 61 మంది 90 పైన మార్కులు సాధించారు. సోషల్ లో తొమ్మిది మంది, తెలుగు లో నలుగురు నూటికి నూరు శాతం మార్కులు సాధించి ఉత్తమ ఫలితాలు అందించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా భాష్యం ఎంవిపి బ్రాంచ్ ప్రిన్సిపాల్ కే.శిల్పా హెచ్ఎం కే.అరుణా లను ఆయన అభినందించారు.
