చీటింగ్ కేసులో ముద్దాయికి రెండేళ్లు జైలు శిక్ష

May 7,2025 10:22 #in Visakha

ప్రజాశక్తి – ఎంవిపి కాలనీ : ఎంవిపి పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో నమోదైన చీటింగ్ కేసు కు సంబంధించి నాల్గవ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ మంగళవారం తీర్పును వెలువరించారు. 2022 ఫిబ్రవరి 18న కే.వీర రాజు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొత్స డేనియల్ సునీల్ కుమార్ పై ఎంవిపి ఎస్సై పీ.లక్ష్మీ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి కే.వాసుదేవరావు, అడిషనల్ పబ్లిక్ పాసిక్యూటర్ సూర్య కుమార్ లు ద్వారా విచారణ జరిపి మంగళవారం 2 సంవత్సరాల జైలు శిక్ష, పదివేల రూపాయల జరిమానాన్ని విధించడం జరిగింది. సంఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాల ప్రకారం మైనింగ్ వ్యాపారం చేసుకునే కొమ్ము వీర్రాజును దక్షిణాఫ్రికా నుండి దిగుమతి చేసుకున్న మ్యాంగనీసు ను పోర్టు ద్వారా అందజేస్తానని అతని వద్ద 11 లక్షల రూపాయలను తీసుకొని సదరు మాంగనీస్ లోడ్ ను సునీల్ కుమార్ అందజేయకుండా తప్పించుకు తిరగడంతో బాధితుడు పోలీసులు ఆశ్రయించాడని దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఈ కేసు విచారణ ఉత్తమ ప్రతిభ కనబరిచి ముద్దాయికి శిక్ష పడేటట్టు అత్యుత్తమ విధులు నిర్వహించినందుకు గాను కోర్ట్ హెడ్ కానిస్టేబుల్ శంకర్ రెడ్డి ని ఎంవిపి సీఐ .జే.మురళి అభినందించారు.

➡️