దర్గా సర్కిల్ (చిత్తూరు) : వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదించడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నదని వక్ఫ్ చట్టంపై సమగ్ర సమాచారంతో ప్రజాశక్తి స్పెషల్ తీసుకురావడం అభినందనీయమని శుక్రవారం చిత్తూరులో దర్గా సర్కిల్ వద్ద ముస్లిం పెద్దలు అభినందించారు . సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు ఆధ్వర్యంలో ముస్లిం పెద్దలు ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం, సిపిఎం మొదటి నుంచి మైనార్టీలకు అండగా నిలబడుతున్నదనితెలిపారు. మతసామరస్యాన్ని కాపాడడంలో ప్రజాశక్తి ముందుంటుందని మేము గమనిస్తున్నామని తెలిపారు. మైనారిటీలపై జరిగే దాడులను ప్రతి సందర్భంలోనూ చిత్తూరులో ఐక్యపోరాటాల్లో సిపిఎం నిరంతరం కలిసి వస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ లౌకికదేశంలో కులాలకు మతాలకు అతీతంగా దేశ సమైక్యత కోసం అందరూ కలిసి ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ఆలంబిస్తున్న మత చిచ్చు లను ప్రతి ఒక్కరు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం దిగరాకపోవడం దారుణమన్నారు. ఇదేదో ముస్లింలకు సంబంధించింది అనుకుని ఇతరులనుకుంటే పొరపాటు అని అన్ని మతాల పైన దాడి చేస్తుందని మతోన్మాద బిజెపి ప్రభుత్వంపై అందరూ అప్రమత్తంగా ఉండాలని వారి విధానాలను ఎండగట్టడంలో ఐక్యంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు.
