ప్రజాశక్తి – ఆచంట
పెట్టుబడిదారులు సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా కార్మికులు, కష్టజీవులను ఐక్యం చేసి శాస్త్రీయమైన సిద్ధాంతాన్ని రూపకల్పన చేసిన మహనీయులు కార్ల్ మార్క్స్ అని సిపిఎం మండల కార్యదర్శి పి.మోహన్రావు అన్నారు. కార్ల్ మార్క్స్ 207వ జయంతిని సోమవారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు ఎస్విఎన్.శర్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత కారల్ మార్క్స్ చిత్రపటానికి పార్టీ సీనియర్ నాయకులు తోటపల్లి సత్యన్నారాయణ, తలుపురి బుల్లబ్బాయి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కమిటీ సభ్యులు ఎస్విఎన్.శర్మ మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు తలుపూరి బుల్లబ్బాయి, కుసుమే జయరాజు, సీనియర్ నాయకులు బండి రంగారావు, చదలవాడ చంటిబాబు, టి.సురేష్ కుమార్ పాల్గొన్నారు.