ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్సి గోపీమూర్తి
ప్రజాశక్తి – భీమవరం
స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణాలు సైతం పణంగా పెట్టిన అల్లూరి సీతారామరాజు ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎంఎల్సి బొర్రా గోపీమూర్తి పిలుపునిచ్చారు. భీమవరంలోని అల్లూరి కాంస్య విగ్రహానికి ఎంఎల్సి గోపీమూర్తి, యుటిఎఫ్ నేతలు బుధవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఎల్సి గోపీమూర్తి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో తన ప్రాణాలను అర్పించిన ధీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అల్లూరి జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గిరిజనులను ఒకే తాటిపైకి తీసుకొచ్చి స్వతంత్ర ఉద్యమానికి నాంది పలికారని పేర్కొన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పిఎస్.విజయరామరాజు, పట్టాభి రామయ్య, సీతారామరాజు, సిహెచ్వి.ప్రసాద్, రామకృష్ణరాజు, ఏసుబాబు పాల్గొన్నారు.