జిల్లా కలెక్టర్ నాగరాణి
ప్రజాశక్తి – భీమవరం
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కొనియాడారు. బుధవారం అల్లూరి వర్థంతి సందర్భంగా భీమవరం జువ్వలపాలెంరోడ్డులోని అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కాంస్య విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అల్లూరి స్వాతంత్ర పోరాటం ఎందరో వీరులకు స్ఫూర్తినిచ్చిందన్నారు. స్వాతంత్ర పోరాటంలో అల్లూరి చరిత్ర ఒక ప్రత్యేక అధ్యాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, సంఘ సంస్కర్త కంతేటి వెంకటరాజు, లైన్ ఇంటర్నేషనల్ సిహెచ్ కృష్ణంరాజు, ఉద్దరాజు గాదిరాజు సుబ్బరాజు పాల్గొన్నారు.భరతమాత ముద్దుబిడ్డ అల్లూరి : జెవివి సీనియర్ నేత అజరుకుమార్ జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యుటిఎఫ్ కార్యాలయంలో అల్లూరి వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జెవివి సీనియర్ నాయకులు వై.అజరుకుమార్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుజాతి గర్వించదగ్గ భరతమాత ముద్దుబిడ్డ అల్లూరి అన్నారు. కార్యక్రమంలో జెవివి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చింతపల్లి ప్రసాదరావు, జె.రామలక్ష్మణరావు, కోశాధికారి మల్లుల శ్రీనివాస్, చెకుముకి జిల్లా కన్వీనర్ రేపాక వెంకన్న బాబు, బొర్రా నాగబాబు, ఫణి రాజేష్, కె.రామకృష్ణంరాజు, పిల్లి.శ్రీనివాస్, ఎస్.సుకుమార్, అలుగు జాన్సన్, టి.వెంకటేశ్వరరావు, క్రాంతి పాల్గొన్నారు.