పేదల ఇళ్ల సమస్య పరిష్కరించే వరకూఅల్లూరి స్ఫూర్తితో పోరు

సిపిఎం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాంపాలకోడేరు ఎఎస్‌ఆర్‌ నగర్‌లో ఒక రోజు నిరాహార దీక్ష

పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతుపేదలకు న్యాయం చేయాలిసిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్‌

ప్రజాశక్తి – భీమవరం

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పేదల ఇళ్ల కూల్చివేత సమస్య పరిష్కారమయ్యే వరకూ పోరాటం సాగిస్తామని సిపిఎం రాష్ట్ర సీనియర్‌ నాయకులు మంతెన సీతారాం అన్నారు. అల్లూరి 101వ వర్థంతి సందర్భంగా పాలకోడేరు అల్లూరి సీతారామరాజు నగర్‌లో పేదల ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ బుధవారం ఒకరోజు కూల్చిన ఇళ్ల శిథిలాల మధ్య నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో కూర్చున్న సిపిఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్‌కు మంతెన సీతారాం పార్టీ కండువా వేసి దీక్షను ప్రారంభించారు. తొలుత అల్లూరి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంతెన సీతారాం మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు స్వగ్రామం మోగల్లు గ్రామానికి ఆనుకుని ఉన్న అల్లూరి సీతారామరాజు నగర్‌లో పేదల ఇళ్లను దుర్మార్గంగా కూల్చి సీతారామరాజు ఆశయాలను తుంగలో తొక్కారన్నారు. ఇప్పటికైనా ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్ల కూల్చివేత ఆపాలని, ఇప్పటికే కూల్చివేతకు గురైన ఇళ్ల బాధితులకు తక్షణం ప్రత్యామ్నాయం చూపి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీక్షలో కూర్చున్న జిల్లా కార్యదర్శి జెఎన్‌వి.గోపాలన్‌ మాట్లాడుతూ రాజు కాలువ పేదల ఇళ్ల వల్ల కలుషితమవుతుందనేది వాస్తవం కాదన్నారు. కలుషితానికి కారణం ఏమిటనేది నిపుణుల కమిటీ ద్వారా తేల్చాలని డిమాండ్‌ చేశారు. రఘురామకృష్ణరాజుకు అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే కాలుష్య నివారణకు ఎటువంటి చర్యలు చేపట్టాలో తెలుసుకోవాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మూడు సెంట్ల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రఘురామకృష్ణరాజు అరాచకాలను ఆపేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇళ్లు కోల్పోయిన నిరుపేదలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరహార దీక్షకు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పాతపాటి హరికుమార్‌రాజు, పట్టణ పౌర సమాఖ్య జిల్లా కన్వీనర్‌ ఎం.వైకుంఠరావు, ఎపి రైతుసంఘం నాయకులు బాలం విజరుకుమార్‌ సంఘీభావం తెలిపి మాట్లాడారు. బుధవారం సాయంత్రం బిఎస్‌పి రాష్ట్ర కార్యదర్శి ఎం.రత్నరాజు దీక్షాధారుడు సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్‌కు కొబ్బరి నీళ్లు ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ, కె.క్రాంతిబాబు, శేషపు అశ్రియ్య, కాంగ్రెస్‌ జిల్లా జనరల్‌ సెక్రటరీ ధర్మేంద్ర పుచ్చకాయల రత్నంరాజు, జిల్లా సెక్రటరీ కొర్ర శ్రీనివాస్‌ యాదవ్‌, సిపిఎం భీమవరం పట్టణ నాయకులు బొక్కా సత్యనారాయణ, పాలకోడేరు మండల నాయకులు దున్న మరియమ్మ, బాధితులు మల్లుల దుర్గారావు, పెచ్చెట్టి సత్యనారాయణ, దొంగ నాగరాజు, మెట్టా రామారావు, మల్లుల పద్మ, పైడి ఆదిలక్ష్మి, జోగి నాగలక్ష్మి, గుడాల లక్ష్మి పాల్గొన్నారు.కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టికి ఇళ్ల తొలగింపు సమస్య కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు హరికుమార్‌ రాజు ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్ల తొలగింపు సమస్యను కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు పాతపాటి హరికుమార్‌రాజు తెలిపారు. జూన్‌లో పిసిసి అధ్యక్షురాలు షర్మిల జిల్లా పర్యటనకు రానున్నారని, ఆమెను ఎఎస్‌ఆర్‌.నగర్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ఇంత ఘోరంగా ఇళ్లు కూల్చివేయడం అన్యాయమన్నారు. పేదల పక్షాన నిరంతరం సిపిఎం పోరాడటం అభినందనీయమన్నారు. ఆయన వెంట కాంగ్రెస్‌ జిల్లా జనరల్‌ సెక్రటరీ ధర్మేంద్ర, జిల్లా సెక్రటరీ కొర్ర శ్రీనివాస్‌ యాదవ్‌ ఉన్నారు.

➡️