ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం
ఎంబిఎ, ఎంసిఎ కోర్సులలో ప్రవేశానికి గాను నిర్వహించిన ఎపి ఐసిఇటి ప్రవేశ పరీక్ష బుధవారం ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్ష వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించగా ఉదయం జరిగిన పరీక్షకు 230 మందికి 215 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 231 మందికి గానూ 206 మంది హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపల్, చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ రత్నాకరరావు తెలిపారు. పరీక్షా కేంద్రం చీఫ్ కో ఆర్డినేటర్ నరేష్, కోఆర్డినేటర్ నటరాజ్, సిస్టమ్ అడ్మిన్ కొల్లా సురేష్, టిసిఎస్ ప్రతినిధులు పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు. శశి ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన పరీక్షలో మొదటి షిఫ్ట్లో 220 మందికి 205 మంది హాజరయ్యారు. రెండో షిఫ్ట్కు 222 మందికి 202 మంది హాజరయ్యారు. పరీక్షలు ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా ముగిసినట్లు పరీక్ష కేంద్రాధికారి పి.రాంబాబు తెలిపారు.