ప్రజాశక్తి – భీమవరం
జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు భీమవరం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సమావేశంలో జిల్లాలోని మంత్రులు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు, జిల్లా అధికారులు పాల్గొనున్నట్లు తెలిపారు.