ప్రజాశక్తి – పోడూరు
పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని సిపిఎం నాయకులు పిల్లి.ప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పండిత విల్లూరులో సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ పనుల్లేక ఇల్లు గడవక ప్రజలు ఆనేక ఇబ్బందులు పడుతుంటే మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా ధరలు పెంపు ఉందన్నారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరను ఉపసంహరించుకోవాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో మేరీ లక్ష్మి, నరసమ్మ, భూలక్ష్మి, వరలక్ష్మి, సుగుణ సీత పాల్గొన్నారు