పాలకొల్లులో వంతెనకు మంత్రులు శంఖుస్థాపన

May 7,2025 12:20 #West Godavari District

ప్రజాశక్తి-పాలకొల్లు : రాష్ట్రంలో మున్సిపాలిటీలు, ఆనుకుని ఉన్న పంచాయతీ ల అనుసంధానంకు రోడ్లు, వంతెనల నిర్మాణానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. పాలకొల్లు 26వ వార్డు నుంచి రూరల్ పంచాయితీకి రూ.43 లక్షలతో నిర్మించే వంతెనకు మంత్రి బుధవారం మంత్రి శంఖుస్థాపన చేశారు. ఈ రోడ్ వలన భవిష్యత్తులో జాతీయ రహదారికి అనుసంధానం ఏర్పడుతుందని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎపిఐఐసి చైర్మన్ మంతెన రిమరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

➡️