తణుకు : తణుకు పట్టణానికి చెందిన బద్దా దీపక్, బద్దా క్రిస్సీ ఏంజెలినాలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. విజయవాడలోని హలెన్ మ్యూజిక్ స్కూల్ ద్వారా ఆన్లైన్ ద్వారా 2024 డిసెంబర్ 1వ తేదీన 18 దేశాల్లో 1046 మందికి కీబోర్డులో స్వరాలను ప్లే చేయడం ద్వారా ఈ రికార్డును సొంతం చేసుకున్నారు. ఈనెల 25వ తేదీన విజయవాడలోని మెట్రో పాలిటిన్ మిషన్ చర్చిలో మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు అగస్టీన్ చేతుల మీదుగా సర్టిఫికెట్స్, మెడల్స్ను అందుకున్నారు. పాతవూరు, ఇరగవరం రోడ్డు, తణుకుకు చెందిన దీపక్కుమార్, క్రిస్సీ ఏంజెలినా ఇద్దరూ అన్నాచెల్లెలు. వీరిద్దరూ ఉండ్రాజవరం రోడ్డులో ఉన్న ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో 8, 7వ తరగతులు చదువుతున్నారు. ఈ సందర్భంగా పలువురు వీరికి అభినందనలు తెలియజేశారు.
