సమస్యలు పరిష్కరించాలని ఆశాల నిరసన

ప్రజాశక్తి – నరసాపురం

ఆశాలను కార్మికులుగా గుర్తించి, కనీస వేతనం రూ.20 వేలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు తెలగంశెట్టి సత్యనారాయణ అన్నారు. మంగళవారం మండలంలోని ఎల్‌బి.చర్ల, తూర్పుతాళ్లు పిహెచ్‌సిల వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశాలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను ఆశాలుగా మార్చాలని, ఒప్పంద జీఒలు విడుదల చేయాలని, నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలని తెలిపారు. ఆశాల నియమాకాలు ప్రభుత్వమే చేయాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్ల సాధనకై కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 20న దేశ వ్యాప్తంగా చేపడుతున్న సమ్మెను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో పి.రత్నకుమారి, కె.వెంకటేశ్వర్లు, ఎం.సునీత, బి.పద్మ, సిహెచ్‌ నాగలక్ష్మి, ఎం.రత్న కుమారి, పి.మరియమ్మ పాల్గొన్నారు.మొగల్తూరు : ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 20న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తెలగంశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం మొగల్తూరులోని పిహెచ్‌సి వద్ద ఆశా వర్కర్లు చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్‌ కోర్టులను రద్దు చేసే కార్మిక చట్టాలను పటిష్ట పర్చాలన్నారు. కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ను ఆశాలుగా మార్చి ఒప్పంద జిఒను వెంటనే అమలు చేయాలన్నారు అనంతరం వినతిపత్రాన్ని ఆరోగ్య సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో కె.సత్యవతి, పి.రేవతి, ఎంసిహెచ్‌.సరోజినీ, ఎ.కోమలి, కె.భవాని, వెంకటరమణ, విజయలక్ష్మి పాల్గొన్నారు.

➡️