బుట్టాయగూడెం: మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు వేసి నివసిస్తున్న గిరిజన కుటుంబాలకి కరెంటు, మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శి కిరణ్కి ఇళ్ల స్థలాల పోరాట కమిటీ ఆధ్వర్యాన వినతిని అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ 2 వేల ఇళ్ల స్థలాలు వేసి నివసిస్తున్న గిరిజన కుటుంబాలకి మంచినీరు, కరెంటు సౌకర్యాలు వెంటనే కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని వారు కోరారు. కరెంటు లేకపోవడంతో ఇల్లు లోపలికి పాములు వస్తున్నాయన్నారు. పంచాయతీ నుంచి కరెంటు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని వినతిలో పేర్కొన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిని పంచాయతీ కార్యదర్శికి అందజేశారు. పంచాయతీ కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ ఇళ్ల స్థలాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సత్వరమే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇళ్ల స్థలాల పోరాట కమిటీ నాయకులు మరియమ్మ, నాగమణి, నాగరాజు ఉన్నారు.
