ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం
తాడేపల్లిగూడెం ప్రథమం శ్రేణి శాఖా గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి శిక్షణ తరగతులు సోమవారం 8వ రోజు ఉత్సాహంగా జరిగినట్లు గ్రంథాలయ అధికారి వి.శ్రీనివాసరావు తెలిపారు. రిసోర్స్ పర్సన్ గరికపాటి బాపయ్య విద్యార్థులకు డొక్కా సీతమ్మ గురించి వివరించారు. అన్ని దానాల్లో కెల్లా అన్నదానం ముఖ్యమైందని డొక్కా సీతమ్మ భావించే వారిని తెలిపారు. జనార్థనరావు విద్యార్థులకు వేమన పద్యాలు, తాత్పర్యం వివరించారు. గ్రంథాలయాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ వేసవి శిక్షణ తరగతులు జూన్ 6వ తేదీ వరకూ జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, పాఠకులు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.