నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ప్రజాశక్తి – భీమవరం

కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10 గంటలకు పాలకొల్లు పట్టణం 26వ వార్డులో బెజవాడ కోడుపై వంతెన నిర్మాణ పనులకు, 10.30 గంటలకు యలమంచిలి మండలం కొంతేరులో ఆవ మీడియం డ్రెయిన్‌పై గ్రావెల్‌ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 11.30 గంటలకు పాలకొల్లు రూరల్‌ గ్రామం నాగరాజు పేటలో 33/11 కెవి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం భీమవరం విద్యుత్‌ శాఖ సర్కిల్‌ ఆఫీస్‌ రెండో అంతస్తు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

➡️