రోజుకు ఏ 10 లక్షల యూనిట్లు

ప్రజాశక్తి – కడప ప్రతినిధి జిల్లాలో విద్యుత్‌ వినియోగం అనూహ్యంగా పెరిగిపోతోంది. ప్రస్తుత వేసవి సీజన్‌లో వేడిగాలులు వీస్తుండడంతో ఎసిలు, కూలర్లు, ఫ్యాన్లు ఇతర శీతలీకరణ ఉపకరణాల వినియోగం పెరిగింది. ఫలితంగా గృహ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విద్యుత్‌ వినియోగం పెరిగిపోతోంది. ఫలితంగా జిల్లాలో ప్రతి రోజూ 10 లక్షల యూనిట్ల మేర అదనపు డిమాండ్‌ ఏర్పడింది. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇందులోభాగంగా ట్రాన్స్‌కో గత మార్చి నెలలో రూ.ఎనిమిది కోట్ల మేర అధిక ఆదాయాన్ని ఆర్జించ డం గమనార్హం. జిల్లాలో 16.524 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ వినియోగం అవుతోంది. గతేడాది ఏప్రిల్‌ 24న 15.26 మిలియన్‌ యూనిట్లతో పోలిస్తే రూ.1.5 మిలియన్‌ యూనిట్లు డిమాండ్‌ పెరిగింది. జిల్లాలో ప్రతి రోజూ సుమారు 43.6 డిగ్రీలతో ఎండలు మండుతున్నాయి. ఫలితంగా రోజురోజుకూ హీట్‌ వేవ్స్‌ వీస్తున్నాయి. ఈమేరకు వాతావ రణశాఖ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు చేస్తోంది. ఈనేపథ్యంలో జిల్లాలోని 8.97,853 లక్షల విద్యుత్‌ వినియోగదా రులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పలితంగా ఎసిలు, కూ లర్లు, ఫ్యాన్లు తదితర శీతలీకరణ ఉపకరణాల వినియోగంతో విద్యు త్‌ వినియోగం అమాంతం పెరిగిపోయింది. ఫలితంగా రోజుకు రూ. 10 లక్షల యూనిట్ల చొప్పున అదనపు విద్యుత్‌ వినియోగం పెరి గింది. రాబోయే రోజుల్లో అదనంగా మరో రెండు మిలియన్లు యూ నిట్ల మేర విద్యుత్‌ వినియోగం పెరిగే అవకాశం ఉందని అంచనా. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈయేడాది మార్చి మాసంలోనే రూ.ఎనిమిది కోట్ల మేరకు ట్రాన్స్‌కోకు అధిక ఆదాయం లభించింది. మే నెలాఖరు నాటికి మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో నిరంతరాయ విద్యుత్‌ సరఫరా చేయడంలో భాగంగా రూ.8.5 కోట్లతో క్రమబద్దీకరణ పనులను వేగవంతం చేసింది. ఇందులోభాగంగా జిల్లాలోని కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, పులి వెందుల డివిజన్ల కేంద్రాల్లో 240 ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. డివిజన్‌ కేంద్రాల పరిధిలో 11 పవర్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఇందులో ఎనిమిది పవర్‌స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఇటువంటి ముందస్తు చర్యల నేపథ్యంలో భాగంగా ఎక్కడా విద్యుత్‌ అంతరా యం ఏర్పడకుండా చూడాలనే ఉద్దేశంతో ట్రాన్స్‌కో యంత్రాంగం ఎక్కడెక్కడ విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడుతున్నాయనే అంశాలపై దృష్టి సారించింది. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మూల కారణాలను ఆరా తీస్తోంది. ఓవర్‌లోడ్‌, ఇతర బౌతిక సమస్యల కారణంగా విద్యు త్‌ అంతరాయాలు ఏర్పడుతున్నాయా లేదా అని పరిశీలిస్తోంది. సమ స్యను గుర్తించిన అనంతరం సత్వరమే పునరుద్ధరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది.

➡️