ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్ : ఉపాధి హామీ కూలీల వేతనాలను వెంటనే చెల్లించాలని, కామన్ వర్క్ ఐడీలను రద్దు చేసి, మేట్ల వ్యవస్థను పునరుద్ధరించాలని వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి జి.రవిబాబు. డిమాండ్ చేశారు. మండలంలోని భృగుబండ, రెంటపాళ్ల గ్రామాల్లో ఉపాధి హామీ పని ప్రదేశాలను నాయకులు శుక్రవారం పరిశీలించి కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రవిబాబు మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు వారం వారం వేతనాలు ఇవ్వాల్సి ఉండగా ఐదారు వారాలులకు కూడా ఇవ్వడం లేదన్నారు. ఒకే రకమైన పనులను కలిపి ఒకే పని గుర్తింపు నంబర్ గా ఇవ్వటం వలన వివిధ పనుల్లో పనిచేసే కూలీలు ఒకే చోటికి వచ్చి హాజరు వేయించుకోవడం, ఆ సమయంలో ఆన్లైన్ హాజరు వేయటానికి సర్వర్ పని చేయకపోవడం వంటి సమస్యలు వస్నుఆ్నయని చెప్పారు. ఉమ్మడి పని గుర్తింపులను రద్దుచేసి ప్రతి పనికి గుర్తింపు నంబరు ఇవ్వాలని, మెట్ల వ్యవస్థను పునరుద్ధరించి ఆ వర్క్ ఐడిలలో ఆయా కూలీలకు మేట్లు పని ఇవ్వటం, పని చేయించడం, హాజరు వేయటం కొలతలు వేయించడం చేయించాలని డిమాండ్ చేశారు. ఈ పనులు చేయించినందుకు గాను మేట్లకు ప్రత్యేక పారితోషకం ఇవ్వాలని కోరారు. కూలీలకు మజ్జిగ, తాగునీరు, పలుగు, పారా, వేసవి అలవెన్సులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి జె.భగత్, నాాయకులు జె.మరియదాసు, ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు.
