మండపేట (కోనసీమ) : మండపేట మండలం జెడ్ మేడపాడు వంతెన సమీపంలో గురువారం రాత్రి మండపేట రూరల్ సీఐ దొరరాజు ఆధ్వర్యంలో వాహనాలు విస్తృత తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ దొరరాజు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ బుచ్చిబాబు,తన సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహనాలను తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఈ తనిఖీలలో భాగంగా అనుమానిత వ్యక్తులు, అనుమానిత వాహనాలు, అనుమానిత పదార్థాలు పై తనిఖీలు చెయ్యడం జరిగిందని, ఐదుగురు వ్యక్తుల పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అలాగే అంగర, రాయవరం స్టేషన్ ల పరిధిలో పలు కేసులను నమోదు చేసినట్లు సిఐ దొరరాజు తెలిపారు.
