‘ఉత్తరం’లో వైసిపి బైక్‌ ర్యాలీ

May 11,2024 23:51 #bike rally, #North, #YCP
North, Ycp Bike rally

 ప్రజాశక్తి-సీతమ్మధార : ఉత్తర నియోజకవర్గంలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కెకె.రాజు ఆధ్వర్యాన భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బాలయ్య శాస్త్రి లే-అవుట్‌లోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ నియోజకవర్గం మొత్తం సాగింది. ముఖ్యఅతిథిలుగా రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు, విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్సా ఝాన్సీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు మాట్లాడుతూ, అనేక సంక్షేమ పథకాల ప్రవేశపెట్టి ప్రజల ముంగిటికే అందించిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాత్రమే అన్నారు. బొత్స ఝాన్సీ మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో విశాఖను పరిపాలన రాజధాని చేయుటకు ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి వైసిపిని పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సనపల చంద్రమౌళి, చొక్కాకుల వెంకటరావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. జివిఎంసి 55వ వార్డు పరిధి గాంధీనగర్‌ కాలనీలో కార్పొరేటర్‌ శశికళతో కలిసి ఉత్తర నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కెకె.రాజు గడపగడపకూ వెళ్లి ప్రచారం చేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. 51వ వార్డు కార్పొరేటర్‌ రెయ్యి వెంకటరమణతో కలిసి ఏకలవ్య కాలనీలో ఇంటింటికీ కెకె.రాజు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ధర్మానికి, అధర్మానికి యుద్ధం : కెకె.రాజు రానున్న ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే యుద్ధమని కెకె.రాజు అన్నారు. ఉత్తర నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణు కుమార్‌రాజు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూటమి నాయకులకు ఓటమి భయం వెంటాడుతుందని, అందుకే అనైతిక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.

➡️