మన్యం బంద్ తో స్తంభించిన జనజీవనం 

  • జిల్లా కేంద్రం పాడేరులో మూతపడిన షాపులు …..
    నిలిచిన ప్రైవేటు వాహనాల రాకపోకలు….
    నిర్మానుష్య మైన ప్రధాన కూడలి ప్రాంతాలు…..

ప్రజాశక్తి-పాడేరు:- రాష్ట్ర మన్యం బంద్ కారణంగా అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో షాపులు, హోటళ్లు, దుకాణాలు, మూతపడ్డాయి. ప్రైవేట్ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలి ప్రాంతాలైన మెయిన్ రోడ్ అంబేద్కర్ సెంటర్ కాంప్లెక్స్ రోడ్ పాత బస్టాండ్ లోని షాపులు మూతపడడంతో నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆదివాసీ గిరిజన సంఘం మరియు గిరిజన సమాఖ్య నాయకులు ఆర్టీసీ బస్సులను అడ్డు కొన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ సమీపంలో బన్ నిర్వాహకులు రోడ్డుపై బైఠాయింపు జరిపారు. బంద్ కారణంగా జనజీవనం స్తంభించింది.

➡️