ప్రజాశక్తి-చాగలమరి : నంద్యాల జిల్లా చాగలమరి మండలంలోని చాగలమర్రి పట్టణంలోని కేరళ ఆసుపత్రి ఎదురుగా అంబేద్కర్ విగ్రహం వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు, ఏఐటీయూసీ సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నాయకులు చేపట్టిన ఆందోళన దీక్షలు శుక్రవారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు సిఐటియు నాయకురాలు పద్మావతి, వసంత, నాగమణి, వై పద్మావతి, ఏఐటీయూసీ నాయకులు చంద్రకళ వహీదా ఇందుమతి ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నాయకులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.