
ప్రయాగ్రాజ్ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి తాము మద్దతునివ్వడం లేదని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నేత స్పష్టం చేశారు. ఫలానా పార్టీకి మద్దతునిస్తుందన్న వార్తలను ఖండించారు. పరేడ్ గ్రౌండ్లో రైతులు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న 'చింతన్ శివిర్'లో పాల్గనేందుకు మాగ్ మేళాకు మంగళవారం వచ్చిన తికాయిత్ మాట్లాడుతూ.. ' ఈ ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతు ఇవ్వం' అని తేల్చి చెప్పారు. రానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాద్ పార్టీ-రాష్ట్రీయ లోక్ దళ్ కూటమికి మద్దతునివ్వాలంటూ బికెయు ప్రెసిడెంట్ నరేష్ తికాయిత్ కోరిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. అయితే.. సిసౌలిలో బిజెపికి చెందిన సంజీవ్ బల్యాన్తో సమావేశమైన కొన్ని గంటల తర్వాత నరేష్ తికాయిత్ తన ప్రకటనను ఉపసంహరించుకున్నారు. రైతుల చింతన్ శివిర్పై రాకేష్ మాట్లాడుతూ... రైతుల సమస్యలపై చర్చించామని అన్నారు.