(మే 6 ‘ప్రపంచ ఆస్తమా దినం’)
దీర్ఘకాలిక అసాంక్రమిక లేదా అంటువ్యాధి కాని (నాన్ కమ్యూనికబుల్ డిసీజ్) వ్యాధుల్లో ఆస్తమా లేదా ఉబ్బసం అతి ప్రధానమైనది. ప్రపంచ్యాప్తంగా సాలీనా 26 కోట్ల ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారని, అందులో 4.5 లక్షల వరకు మరణాలు కూడా సంభవిస్తున్నాయని అంచనా. భారత్లో అత్యధిక ఉబ్బస రోగులు ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే ఆస్తమాను తగు జాగ్రత్తలతో నిరోధించవచ్చు. కలుషిత గాలి, శీతల గాలులు, పూల సుగంధ పరిమళాలు, దుమ్ము ధూళి, సిగరెట్టు పొగలు, బాణాసంచా కాల్చడం, అగరు వత్తుల పొగలు, ఫేస్ పౌడర్ పీల్చడం, ఎలర్జీకి కారణమయ్యే వాటికి దూరంగా ఉండడం వల్ల ఉబ్బసం నివారించబడుతుంది లేదా వ్యాధిగ్రస్థుల్లో ఉపశమనం కలుగుతుంది. వీటితోపాటు రోగులకు దూరంగా ఉండడం, శీతల వాతావరణాలకు దూరంగా ఉండడం, ఇల్లు/ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, అందుబాటులో ఉన్న అన్ని వ్యాధుల కట్టడికి టీకాలను తీసుకోవడం, వైద్యుల సూచనలతో తగు ఔషధాలను విధిగా వాడడం తప్పనిసరి.
– డా|| బుర్ర మధుసూదన్ రెడ్డి