నరేంద్ర మోడీ మొదటిసారి అమరావతి ప్రారంభోత్సవానికి వచినప్పుడు చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి వెళ్లారు. ఏమీ ఇవ్వలేదే అనుకున్నాము. ఈసారి కనీసం అవి కూడా తీసుకురాలేదు. ప్రతిపక్షం వాళ్ళు చంద్రబాబు ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదని అంటున్నారు. దానికి ఎవ్వరూ నోరు మెదపరే! ఆయన కూడా ఎదో మీట నొక్కి వెళ్ళారు. రూ. 58 వేల కోట్లు అన్నారు. ఇంతకీ అవి అప్పా, ఉచితమా! అప్పుగానే అని వినిపిస్తోంది. అసలు సంగతి…మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రిగా గద్దె ఎక్కేటప్పుడు దేశంలోని ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు జమ వేస్తాను అన్నారు. అది ఏమైందో ఆయన మరలా చెప్పలేదు. కానీ ప్రజలు మరువలేదు. పోస్టుమ్యాన్ వచ్చినపుడల్లా రూ.15 లక్షలు గుర్తుకొస్తాయి. కవరు వస్తుందేమో అని. బ్యాంకుకు వెళ్లినప్పుడల్లా ఖాతా ఆ డబ్బు పడిందేమోనని అడిగి చూసుకోవడం! ఒక్క పైసా కూడా జమ కాలేదని తెలుసుకుని నిట్టూర్చడం పరిపాటి అయ్యింది. ఒకసారి నాకు ప్రధానమంత్రి కార్యాలయం నుండి ఒక కవరు వస్తే, రూ.15 లక్షల కవరేమో అనుకొని సంతోషపడుతూ చించి చూస్తే అది వేరే కవరు. మోడీజీ…మీ సొంత పైకం ఇవ్వమనటంలేదు. విదేశాలలో మనవాళ్లు దాచిపెట్టిన నల్లధనాన్ని, బయటకి తీసి ఇస్తామన్నారు. మరచి పోయారేమో! మరల గుర్తు చేసుకొని, మాట నిలుపుకోండి మోడీజీ. మీ నుండి ప్రజలు కోరుకునే వాటిలో ఇదీ ఒకటి.
– నార్నె వెంకట సుబ్బయ్య.
