చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ధూం ధాం’. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్పై ఎంఎస్ రామ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి దర్శకుడు సాయి కిశోర్ మచ్చ. గోపీ మోహన్ స్టోరీ, స్క్రీన్ప్లే అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ని చిత్రబృందం విడుదల చేసింది.
