అల్లరి నరేష్ సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.29గా రూపొందనున్న ఈ సినిమాని అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 30న ప్రకటించారు. తాజాగా శనివారం పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభిం చారు. ‘ఫ్యామిలీ డ్రామా’ చిత్రంతో ప్రశంసలు అందుకున్న రచయిత, దర్శకుడు మెహర్ తేజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వారం రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నూతన కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించి, ఘన విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రుహాని శర్మ ఈ చిత్రంలో హీరోయిన్గా చేస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందించనున్నారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
