తమిళంలో ప్రదీప్ రంగనాథన్తో నటించిన ‘డ్రాగన్’ సినిమాతో మంచి హిట్ కొట్టిన కోలీవుడ్ నటి కయదు లోహర్కు ఇప్పుడు దక్షిణాదిలో మంచి అవకాశాలు వస్తున్నాయి. నాని సినిమా ‘ది ప్యారడైజ్’లో ఆమె కథానాయిక. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్లో నటుడు అధర్వకు జంటగా హృదయం మురళి సినిమాలో నటిస్తున్నారు. తాజాగా శింబు సరసన ఆయన 49వ చిత్రంలో నటించటానికి సిద్ధమవుతోంది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్కుమార్తో జతకట్టే ఛాన్స్ కూడా ఆమెను వరించింది. ఈ చిత్రానికి మారియప్పన్ చిన్నా దర్శకత్వం వహించనున్నారు. అరుణ్కుమార్ ధనశేఖరన్ నిర్మించనున్న ఈ చిత్రానికి శ్యామ్ సిఎస్ సంగీతాన్ని అందించనున్నారు.
